- జస్టిస్ మన్మోహన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
- ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆయనను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం ఇటీవల సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ఆ ఉత్తర్వులు జారీ చేశారు.
- ఆయన బాధ్యతలు చేపట్టిన రోజునుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది.
- ఆయనతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరుతుంది, ఇంకా ఒక న్యాయమూర్తిని నియమించాల్సి ఉంది.
