Breaking News

NH-65పై టోల్ ఛార్జీల తగ్గింపు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: జాతీయ రహదారి 65పై ప్రయాణించే వారికి శుభవార్త అందింది. హైదరాబాద్–విజయవాడ మార్గంలో టోల్ ఫీజులను స్వల్పంగా తగ్గిస్తూ అధికారులు కొత్త రేట్లను ప్రకటించారు. ఈ సవరించిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.తెలుగు రాష్ట్రాలను కలిపే ఈ ప్రధాన హైవేపై ప్రతిరోజూ భారీగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ నేపథ్యంలో వాహనదారుల భారం కొంత తగ్గించేందుకు కొన్ని వాహనాలపై రూ.5 వరకు టోల్ ఫీజును తగ్గించారు.పంతంగి మరియు కొర్లపహాడ్ టోల్ ప్లాజాల్లో ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ముఖ్యంగా 3 యాక్సిల్ కమర్షియల్ వాహనాలకు సింగిల్, రిటర్న్ జర్నీలకు తగ్గించిన రేట్లు వర్తిస్తాయి.అదే సమయంలో కార్లు, జీపులు, వ్యాన్లు వంటి లైట్ మోటార్ వాహనాలకు ఇప్పటికే ఉన్న రేట్లే కొనసాగుతున్నాయి. లైట్ కమర్షియల్ వాహనాలు, మినీ బస్సులు, ట్రక్కులకు కూడా సవరించిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.కొత్త టోల్ రుసుములు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికులు ముందుగానే వివరాలు తెలుసుకుని ప్రయాణం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

‘సమగ్ర సంక్షేమ కార్డు’ రూపకల్పనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

కాజీపేటలో త్వరలో ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ: అశ్వినీ వైష్ణవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *