Breaking News

హుజురాబాద్ ఎమ్మెల్యేకు సీఐడి నోటీసులు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కు సీఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన ఘటనలపై ఈ నోటీసులు ఇవ్వబడినట్లు వెల్లడించారు.జాతర ఏర్పాట్లలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో విధులకు ఆటంకం కలిగించడం, అనుచరులతో కలిసి రహదారిపై కూర్చొని ట్రాఫిక్‌ను అడ్డుకోవడం వంటి ఆరోపణలు ఉన్నట్లు సీఐడి తెలిపింది.అదనంగా, కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఘౌస్ ఆలం పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కూడా నోటీసుల్లో ప్రస్తావించారు.ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 4న లక్డీకాపూల్ లోని సీఐడి కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఘటనపై సీఐడి అధికారులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తెలంగాణ గ్రామాలకు కేంద్రం భారీ ఊరట

సర్వే చేయించండి: సర్పంచ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *