Breaking News

మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కుటుంబానికి సీఎం పరామర్శ

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల రంజిత్ రెడ్డి తల్లి చంద్రకళమ్మ మరణించడంతో, ఆమెకు నివాళులు అర్పించేందుకు సీఎం ఈ సందర్శన చేపట్టారు. చంద్రకళమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.ఈ విషాద సమయంలో తాము అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

‘సమగ్ర సంక్షేమ కార్డు’ రూపకల్పనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

కాజీపేటలో త్వరలో ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ: అశ్వినీ వైష్ణవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *