Breaking News

హైదరాబాద్‌లో ఆహార కల్తీ దందా భయంకరం

హైదరాబాద్, మార్చి 31, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ఆహార భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల వెలుగులోకి వస్తున్న గణాంకాలు చూస్తే, నగరంలో కల్తీ ఆహార దందా విస్తృతంగా జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. కేవలం ఒక నెల వ్యవధిలోనే 61 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.ప్రజలు రోజూ వినియోగించే పాలు, పెరుగు, టీ పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌తో పాటు ఐస్‌క్రీమ్స్ వంటి పదార్థాల్లో కూడా నాసిరకం, ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. లాభాల కోసం కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి ప్రత్యేక దళాన్ని రంగంలోకి దింపింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పనిచేస్తున్న H-FAST బృందం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో భాగంగా ఇప్పటికే 15 టన్నులకుపైగా కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని, 64 మందిని అరెస్ట్ చేశారు.

‘సమగ్ర సంక్షేమ కార్డు’ రూపకల్పనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ఇటీవల కాటేదాన్‌లో భారీగా కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకోగా, మెహిదీపట్నంలో కెమికల్స్‌తో తయారు చేసిన ఐస్‌క్రీమ్స్‌ను కూడా పట్టుకున్నారు. ఈ దందాలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ కఠిన చర్యలు తీసుకుంటామని వి. సి. సజ్జనార్ హెచ్చరించారు. అనుమానాస్పద ఆహార పదార్థాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను సూచించారు.

కాజీపేటలో త్వరలో ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ: అశ్వినీ వైష్ణవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *