Breaking News

సివిల్ రైట్స్ డే పై అవగాహన సదస్సు: ఎస్ ఐ

నడిగూడెం, మార్చ్ 31(నేటి తెలుగు పత్రిక): నడిగూడెం మండలం రాoపురం గ్రామంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల చివరి రోజు జరుపుకునే ఈ కార్యక్రమంలో ప్రజలకు పౌర హక్కులపై స్థానిక ఎస్సై అజయ్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ , ఇతర శాఖ అధికారులు అధికారులు పాల్గొని గ్రామస్థులకు పౌర హక్కుల ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలు తమ హక్కులను తెలుసుకొని వాటిని వినియోగించుకోవాలని, సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు సూచించారు. చట్టాన్ని, హక్కులను దుర్వినియోగం చేయొద్దు అని కోరారు.కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బూత్కూర్ వెంకట్, పలువురు వార్డు సభ్యులు,గ్రామస్థులు పాల్గొని పౌర హక్కులపై అవగాహన పొందారు.

‘సమగ్ర సంక్షేమ కార్డు’ రూపకల్పనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

కాజీపేటలో త్వరలో ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ: అశ్వినీ వైష్ణవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *