మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఎన్నికల వేళ తమిళనాడులో నిఘా చర్యలు మరింత కట్టుదిట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు.తంజావూరు సమీపంలోని సాలియమంగళం వద్ద సీఎం కాన్వాయ్ను ఆపి వాహనాన్ని పూర్తిగా సోదా చేశారు. ముందుభాగంతో పాటు వెనుక భాగాన్ని కూడా పరిశీలిస్తూ నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహించారు. మహిళా పోలీసులు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నారు.అయితే వాహనంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించకపోవడంతో అధికారులు వెంటనే క్లియర్ ఇచ్చారు. అనంతరం సీఎం తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ నేతల వాహనాలకూ మినహాయింపు లేకుండా తనిఖీలు కొనసాగుతున్నాయి.
