Breaking News

టీమిండియా అవకాశం లేకపోతే ఐస్‌లాండ్‌కు ఆహ్వానం

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: భారత క్రికెట్‌లో కొత్త సంచలనం గా ఎదుగుతున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు తన దూకుడు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లను మట్టికరిపిస్తున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రదర్శనతో వైభవ్ పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతోంది.ఈ నేపథ్యంలో ఐస్‌లాండ్ క్రికెట్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. “టీమిండియా అతన్ని ఎంపిక చేయకపోతే, నాలుగేళ్ల అర్హత పూర్తయ్యాక కూడా అతను టీనేజర్‌గానే ఉంటాడు.. అప్పటికి మా దేశానికి ఆడొచ్చు” అంటూ సరదాగా పోస్ట్ చేసింది. ఈ వ్యాఖ్యలతో వైభవ్ ప్రతిభపై ప్రపంచ దృష్టి మరింత పెరిగింది.ఐపీఎల్ వేలంలో రూ.1.10 కోట్లకు ఎంపికైన ఈ యువ ఆటగాడు, అతి చిన్న వయసులోనే మిలియనీర్‌గా రికార్డు సృష్టించాడు. గుజరాత్‌పై వేగవంతమైన సెంచరీతో పాటు వరుసగా అద్భుత ప్రదర్శనలు ఇస్తూ తన ప్రతిభను నిరూపిస్తున్నాడు.వైభవ్ దూకుడు ఆటను చూసి మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్తులో టీమిండియాకు ఈ యువ సంచలనం కీలక ఆటగాడిగా మారుతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

RR అమ్మకం.. షేన్‌వార్న్‌ ఫ్యామిలీకి ₹450 కోట్లు

కొత్త యజమానుల చేతుల్లోకి రాజస్థాన్ రాయల్స్.. రికార్డ్ ధరకు డీల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *