Breaking News

తెలంగాణ గ్రామాలకు కేంద్రం భారీ ఊరట

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్ సంస్థలకు ప్రత్యేక గ్రాంట్లను విడుదల చేస్తూ గ్రామాల అభివృద్ధికి ఊతమిచ్చింది.15వ ఆర్థిక సంఘం సూచనల మేరకు పలు రాష్ట్రాలకు కలిపి విడుదల చేసిన నిధుల్లో భాగంగా తెలంగాణకు రూ.247.94 కోట్ల అన్‌టైడ్ గ్రాంట్లు కేటాయించారు. ఈ నిధులు రాష్ట్రంలోని వేలాది గ్రామ పంచాయతీలకు నేరుగా చేరనున్నాయి.గ్రామాల్లో రోడ్లు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నారు. అయితే ఈ గ్రాంట్లను ఉద్యోగుల జీతాలు లేదా ఇతర పరిపాలనా ఖర్చులకు వినియోగించరాదని కేంద్రం స్పష్టంగా పేర్కొంది.గ్రామ సభ ఆమోదంతో మాత్రమే పనులు చేపట్టాలని, ఖర్చులన్నీ పారదర్శకంగా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రూపాయి వినియోగంపై ఆడిట్ తప్పనిసరి చేయడంతో నిధుల దుర్వినియోగానికి చెక్ పడనుంది. పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగంగా అమలవుతాయని అధికారులు భావిస్తున్నారు.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులపై కేంద్రం తాజా ప్రకటన

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *