Breaking News

మంగళగిరిలో లోకేష్ ప్రజాదర్బార్ కొనసాగింపు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌ను కొనసాగిస్తున్నారు. 86వ రోజుకు చేరుకున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో, లోకేష్ ప్రతి ఒక్కరి వినతులను స్వీకరించి వివరాలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా ఉండాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వచ్చిన ప్రతి అభ్యర్థనను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు రేపు పార్లమెంట్ ముందుకు

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులపై కేంద్రం తాజా ప్రకటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *