హైదరాబాద్, మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఎల్పీజీ కొరత సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించింది. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికు లేఖ రాశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎల్పీజీ ఆధారిత ఆటో రిక్షాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని లేఖలో ప్రస్తావించారు. ఇంధన కొరత కారణంగా డ్రైవర్ల జీవనోపాధి ప్రభావితమవుతోందని తెలిపారు.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి అదనపు ఎల్పీజీ సరఫరా వెంటనే పెంచాలని కేంద్రాన్ని మంత్రి కోరారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

