మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఎన్నికల సందర్బంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు రాత్రి కేరళకు ప్రయాణం కానున్నారు.కేరళలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని పలు సభల్లో ప్రసంగించనున్నారు. అనంతరం ఎల్లుండి తమిళనాడుకు వెళ్లి అక్కడ కూడా ప్రచారంలో భాగమవుతారు.ఈ యాత్రలో భాగంగా స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు సమాచారం.
