యాదగిరిగుట్ట : మార్చి 31 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేకత పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళ నాయకులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని క్షమించి, మంచి బుద్ధిని ప్రసాదించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని రక్షించాలని యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, మాజీ కరీంనగర్ జడ్పీ చైర్మన్ తుల ఉమ గారు మరియు బిఆర్ఎస్ రాష్ట్ర మహిళ నాయకులు పాల్గొన్నారు.
