Breaking News

హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు రాష్ట్రం గ్రీన్ సిగ్నల్

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల అమలులో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు మార్గాల కోసం భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది.ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్యూచర్ సిటీ ప్రాంతంలో సుమారు 500 ఎకరాల భూమిని కేటాయించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ శివారులో ఈ ప్రాజెక్టుకు అవసరమైన స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–పుణె కారిడార్లపై ప్రాథమిక సర్వేలు కొనసాగుతున్నాయి. త్వరలోనే డీపీఆర్ పనులు పూర్తి చేసి తదుపరి దశకు వెళ్లనున్నట్లు సమాచారం.ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే దక్షిణ భారత నగరాల మధ్య కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడనుంది. ముఖ్యంగా చెన్నై, బెంగళూరుకు ప్రయాణ సమయం భారీగా తగ్గి కొన్ని గంటల్లోనే చేరుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

దుండగుల దురాగతం.. రైతు శ్రమకు నిప్పులు

ప్రజల భాగస్వామ్యంతో మూసి పునర్జీవనం: భట్టి విక్రమార్క మల్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *