న్యూఢిల్లీ, మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026ను కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ముందుగా లోక్సభలో ఈ బిల్లుపై చర్చ జరగనుండగా, ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.లోక్సభ ఆమోదం అనంతరం బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది. అక్కడ కూడా చర్చ అనంతరం ఆమోదం పొందే అవకాశం ఉంది. ఈ సవరణ బిల్లు ద్వారా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు అంశాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.
