Breaking News

Restoration of the VIRO system again in Telangana

తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ

|| Restoration of the VIRO system again in Telangana ||

హైదరాబాద్:
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలోనే ప్రకటించి సంక్రాంతి నాటికి వ్యవస్థను తిరిగి తీసుకువస్తామని వెల్లడించారు.

ప్రస్తుతానికి రాష్ట్రంలో సుమారు 3,000 వీఆర్వోలు ఉండగా, కొత్తగా 8,000 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్వోలను నేరుగా బాధ్యతలు అప్పగిస్తారు. మిగతా ఖాళీలను ప్రత్యేక రాత పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. పొంగులేటిపై మైనింగ్ ఆరోపణల ఫిర్యాదు

10,909 రెవెన్యూ గ్రామాలకు నియామకాలు
రాష్ట్రంలోని 10,909 రెవెన్యూ గ్రామాలకు వీఆర్వోలను నియమించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నియామకాల ద్వారా రెవెన్యూ వ్యవస్థకు సరైన నియంత్రణ, పారదర్శకత తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

గతంలో రద్దు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రెవెన్యూ శాఖలో అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు. అయితే, పునరుద్ధరణతో గ్రామస్థాయిలో రెవెన్యూ పనులను సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటి నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు, రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

కల్తీ ఆహారంపై యుద్ధం.. ప్రత్యేక వ్యవస్థతో కఠిన చర్యలు: సీఎం రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *