ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అస్సాం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విభిన్న శైలిలో కనిపించారు. దిబ్రూగఢ్ లోని తేయాకు తోటను సందర్శించిన ఆయన, అక్కడి కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటించారు.ఈ సందర్భంగా మహిళా కార్మికులతో కలిసి తేయాకు ఆకులు కోసి, వారి రోజువారీ జీవన విధానాన్ని దగ్గరగా తెలుసుకున్నారు. వారి అభ్యర్థనపై సెల్ఫీలు తీసుకుని వారిని ఆనందపరిచారు.తేయాకు కార్మికుల కష్టాన్ని ప్రశంసించిన ప్రధాని, తేయాకును “అస్సాం ఆత్మ”గా అభివర్ణించారు. ఈ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, టీ తోటల కుటుంబాల కృషి రాష్ట్ర గౌరవాన్ని ప్రపంచానికి చాటుతోందని పేర్కొన్నారు. తేయాకు తోటల్లో పనిచేసే కుటుంబాల అంకితభావం, శ్రమ పట్ల గర్వంగా ఉందని ప్రధాని తెలిపారు.
