అమరావతి, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో పట్టణ పేదల కోసం చేపట్టిన టిడ్కో గృహ నిర్మాణ ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి వచ్చింది. గతంలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాన్ని పునరుద్ధరించి, పెద్ద ఎత్తున పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.2014-19 మధ్య నిర్మాణం ప్రారంభమైన టిడ్కో ఇళ్లు తర్వాతి కాలంలో వివిధ కారణాలతో నిలిచిపోయాయి. దీనివల్ల వేలాది లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆ ప్రాజెక్టును తిరిగి వేగవంతం చేసి, మౌలిక సదుపాయాలతో ఇళ్లను పూర్తి చేసే పనులు చేపట్టింది.ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒకే విడతలో 2.5 లక్షలకుపైగా ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించడం రాష్ట్రంలో కీలక ఘట్టంగా నిలిచింది. ఇందులో టిడ్కో ఇళ్లతో పాటు ఇతర గృహాలూ ఉన్నాయి.పేదలకు గృహాలందించడమే లక్ష్యంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్థలాల కేటాయింపుతో పాటు ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నారు. 2029 నాటికి ప్రతి కుటుంబానికి సొంతిల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
