న్యూఢిల్లీ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లుకు భారత జాతీయ కాంగ్రెస్ లోక్సభలో సంపూర్ణ మద్దతు ప్రకటించింది.పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి తీసుకొస్తున్న బిల్లుకు తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.రాష్ట్రాభివృద్ధి దృష్ట్యా రాజధాని అంశంలో స్పష్టత అవసరమని పేర్కొంటూ, ప్రజల ఆశయాలను గౌరవించేలా నిర్ణయాలు ఉండాలని సూచించారు. ఈ పరిణామంతో అమరావతి అంశం మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది.
