హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో రేషన్ కార్డుల తొలగింపు అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు.ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెబుతూ, మరోవైపు పెద్ద ఎత్తున కార్డులను తొలగించే చర్యలు తీసుకుంటోందని ఆమె ఆరోపించారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం, చిన్న ఉద్యోగాలు చేయడం వంటి కారణాలతో కార్డులను రద్దు చేయడం సరైంది కాదని విమర్శించారు.చిరుద్యోగులు, సామాన్య ప్రజలకు ఉపయోగపడే రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలపై భారం పడే విధంగా నిర్ణయాలు తీసుకోకూడదని హెచ్చరించారు. నిరుద్యోగ యువతను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని, వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
