న్యూఢిల్లీ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది.ఈ బిల్లుకు భారత జాతీయ కాంగ్రెస్ తో పాటు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించడం విశేషంగా మారింది. అధికార పార్టీ ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రతిపక్షాలు అండగా నిలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ, ఏపీ పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. ప్రత్యేక హోదా, పరిశ్రమలకు రాయితీలు వంటి అంశాలను అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు.ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రవేశపెట్టగా, వివిధ పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. లోక్సభలో ఆమోదం అనంతరం బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది.ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన నేపథ్యంలో, అమరావతి రాజధాని అంశం మరో కీలక దశకు చేరుకుంది.
