Breaking News

అమరావతి బిల్లుపై మిథున్ రెడ్డి వ్యాఖ్యలు.. రైతుల హక్కులపై ప్రశ్నలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.అమరావతి నిర్మాణం కోసం సుమారు 34 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారని, భూములు ఇచ్చిన రైతులకు అనేక హామీలు ఇచ్చినా ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని పేర్కొన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లపై స్పష్టమైన గడువు బిల్లులో పేర్కొనాలని ఆయన డిమాండ్ చేశారు.ప్లాట్లు రాక నిరాశతో ఒక రైతు గుండెపోటుతో మరణించారని చెబుతూ, ఈ అంశంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అంశాలపై కూడా పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని సూచించారు.రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత తీసుకురావాలని మిథున్ రెడ్డి కోరారు.

గోదావరి కాలుష్యంపై పరిశ్రమలకు మంత్రి దుర్గేష్ హెచ్చరిక

ఏపీలో మినీ ఎన్నికల హీట్.. క్యాడర్‌కు సిద్ధంగా ఉండాలని మూడు పార్టీల పిలుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *