హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.గవర్నర్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని, ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధికి గవర్నర్ అందిస్తున్న సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ సాధనలో గవర్నర్ మార్గదర్శకత్వం ముఖ్యమని సీఎం తన సందేశంలో వెల్లడించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం, రాజభవన్ సమిష్టిగా పనిచేయాలని ఆయన సూచించారు.
