హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వం జారీ చేస్తున్న పలు జీవోలు నిరుద్యోగ యువతకు అడ్డంకులుగా మారుతున్నాయని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా డిగ్రీ లెక్చరర్ల నియామకానికి సంబంధించిన జీవో నంబర్ 4తో పాటు డీఎస్సీ, గ్రూప్స్, పోలీస్, గురుకుల నియామకాలపై ఉన్న జీవోలు అవకాశాలను తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు.ఈ జీవోలను వెంటనే సమీక్షించి రద్దు చేయాలని డిమాండ్ చేసిన కవిత, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఉద్యోగ హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.ఇక రేషన్ కార్డుల తొలగింపు అంశంపై కూడా స్పందిస్తూ, చిన్న ఉద్యోగాలు చేస్తున్నవారిపై అన్యాయం చేయకూడదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
