ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్కు అమరావతే శాశ్వత రాజధానిగా కొనసాగుతుందని బీజేపీ ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి ఒకే రాజధాని అవసరమని, ఆ దిశగా అమరావతి కీలక పాత్ర పోషిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.రాజధాని అంశంపై ఎలాంటి అనిశ్చితి అవసరం లేదని స్పష్టం చేసిన పురందేశ్వరి, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు. అమరావతి నిర్మాణం పూర్తయితే పరిపాలన మరింత సమర్థవంతంగా జరుగుతుందని చెప్పారు.రాష్ట్ర ప్రజల ఆశయాలకు అనుగుణంగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఆమె ఆకాంక్షించారు.
