ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రీమియం డీజిల్ ధర కూడా లీటరుకు సుమారు రూ. 1.50 పెరిగింది. చమురు కంపెనీల ప్రకారం, అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి మారకపు రేటు మార్పులు ఈ నిర్ణయానికి కారణమన్నారు.ఈ పెంపు ప్రధానంగా రవాణా, లాజిస్టిక్స్, వ్యవసాయ రంగాలపై అదనపు భారం ఏర్పరుస్తుంది. సోమవారం రాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.
కొత్త ధరలు:
- ఎక్స్పి100 (100 ఆక్టేన్) పెట్రోల్: రూ. 149 → రూ. 160
- ఎక్స్ట్రా గ్రీన్ ప్రీమియం డీజిల్: రూ. 91.49 → రూ. 92.99
ప్రేమియం డీజిల్ మెరుగైన మైలేజ్, ఇంజిన్ పనితీరును అందించినప్పటికీ, పెరుగుతున్న ధరల కారణంగా వినియోగం తగ్గే అవకాశం ఉంది.
