ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “మన బడి పిలుస్తోంది” కార్యక్రమం మంచి స్పందన పొందుతోంది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను నిలబెట్టాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు వివరించడంతో పాటు, పూర్వ విద్యార్థుల విజయాలను ఉదాహరణగా చూపిస్తూ ఆకర్షిస్తున్నారు.అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా ఉపాధ్యాయులు సృజనాత్మక ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను చాటుతున్నారు. ఈ కృషిని అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సమిష్టిగా ముందుకు తీసుకెళ్తున్నారు.ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యాభివృద్ధికి సమాజంలోని అన్ని వర్గాలు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు మరింత విద్యార్థులతో కళకళలాడాలని ఆకాంక్షించారు.
