Breaking News

దేశవ్యాప్తంగా అమరావతికి మద్దతు.. ప్రజల ఆకాంక్ష నెరవేరుతోంది – లోకేష్

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. లోక్‌సభలో జరిగిన చర్చను తాను టీవీలో పూర్తిగా వీక్షించానని, ఆ చర్చ ఉత్కంఠ రేపిందని పేర్కొన్నారు.సభలో సభ్యులు అమరావతి చరిత్ర, సంస్కృతి, అవసరాన్ని వివరిస్తున్నప్పుడు ఒక ఆంధ్రుడిగా గర్వంగా అనిపించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహా దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని అన్నారు.లోక్‌సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటికీ మరోసారి పరిచయమైందని లోకేష్ వ్యాఖ్యానించారు. అయితే ఈ కీలక చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని, అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. “నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం.. నా రాజధాని అమరావతి అజరామరం” అని ఆయన పేర్కొన్నారు.

గోదావరి కాలుష్యంపై పరిశ్రమలకు మంత్రి దుర్గేష్ హెచ్చరిక

ఏపీలో మినీ ఎన్నికల హీట్.. క్యాడర్‌కు సిద్ధంగా ఉండాలని మూడు పార్టీల పిలుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *