Breaking News

ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది.ఈ పథకం కింద చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష చేనేత కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయిప్రభుత్వ అంచనాల ప్రకారం, సాధారణ మగ్గం ఉపయోగించే కుటుంబానికి సంవత్సరానికి రూ.8,640 వరకు, మరమగ్గాల వారికి రూ.21,600 వరకు ఆదా అవుతుంది. దీంతో చేనేత కార్మికులపై ఉన్న విద్యుత్ ఖర్చు భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.ఈ పథకానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు రూ.150 కోట్లు వెచ్చించనుంది. చేనేతల జీవనోపాధిని మెరుగుపరచడం, వారికి గౌరవప్రదమైన జీవితం కల్పించడం లక్ష్యమని మంత్రి తెలిపారు.ఇక చేనేతల సంక్షేమం కోసం త్వరలో “నేతన్న భరోసా” పథకాన్ని కూడా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదనంగా చేనేత వస్త్రాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్లు, డిస్కౌంట్ పథకాలు, క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి

పడమర బైపాస్ పై చినకాకాని వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *