Breaking News

చేనేతలకు వరం.. ఉచిత విద్యుత్ పథకం.

మాజీ కౌన్సిలర్ టిడిపి నాయకులు రంగిశెట్టి నరేంద్ర (బాబి)

ఉచిత విద్యుత్ పథకానికి జీఓ జారీ పట్ల హర్షం

నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల చిత్ర పటాలకు పాలాభిషేకం.

మంగళగిరి ఏప్రిల్ 01 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): చేనేత కార్మికులకు వరం ఉచిత విద్యుత్ పథకం అని మాజీ కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రంగిశెట్టి నరేంద్ర (బాబి) అన్నారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మర మద్దాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలకు సంబంధించి జీఓ జారీ చేశారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ, బుధవారం టిడిపి 1, 2 వార్డుల కార్యకర్తలు, చేనేత కుటుంబాలతో కలిసి కొత్తపేట బాపనయ్య గారి వీధి నందు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ల చిత్ర పటాలను ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. ముఖ్య అతిథి రంగిశెట్టి నరేంద్ర మాట్లాడుతూ, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, చేనేతలకు ఉచిత విద్యుత్ ను అందించేందుకు జీఓ జారీ చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. దీని వలన చేనేత కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మంత్రి నారా లోకేష్ చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు, చేనేత వస్త్రాల ప్రాధాన్యతను పెంచేందుకు చేస్తున్న కృషిని నరేంద్ర కొనియాడారు. ఈ కార్యక్రమంలో శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు సుఖ మంచి గిరి బాబు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, టిడిపి మంగళగిరి పట్టణ కార్యదర్శి తాడిగిరి సుధీర్, సాయినాదం శ్రీనివాసరావు, కట్టా దుర్గారావు, పణిదపు మల్లేశ్వరరావు, రాజు, సాంబశివరావు, శ్రీనివాసరావు, కట్టా వాసు, ముసలయ్య, బండారు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

పడమర బైపాస్ పై చినకాకాని వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *