Breaking News

హైదరాబాద్‌లో దారుణం.. యువకుడిపై గంజాయి గ్యాంగ్ దాడి

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: నగరంలో మరోసారి గంజాయి గ్యాంగ్ భయాందోళనకు గురిచేసింది. మైలార్ దేవ్‌పల్లి పరిధిలోని శాస్త్రీపూర్‌లో ఫహాద్ అనే యువకుడిపై దుండగులు కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశారు.అకస్మాత్తుగా దాడికి దిగిన గ్యాంగ్ విచక్షణారహితంగా కత్తులతో పొడవడంతో ఫహాద్ తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.పాత కక్షలే ఈ దాడికి కారణమని అనుమానిస్తున్న పోలీసులు, షానవాజ్, షాబాజ్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కేసుగా నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అమరావతి బిల్లుకు స్వాగతం.. తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం: మహేష్ గౌడ్

తల్లి-పిల్లల ఆత్మహత్య కేసులో ఉద్రిక్తత.. తండాలో హింసాత్మక ఘటనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *