హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: నగరంలోని కేపీహెచ్బీ కాలనీలో సాగుతున్న వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు ఛేదించారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏహెచ్టీయూ బృందం అకస్మాత్తుగా దాడి చేసి వ్యవహారాన్ని బహిర్గతం చేసింది. భాగ్యనగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రంపై దాడి చేసి ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఐదుగురు మహిళలను కూడా పోలీసులు రక్షించారు.ఘటనాస్థలం నుంచి రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని, నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నగరంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని హెచ్చరించారు.
