న్యూఢిల్లీ, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీలను అభినందించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, సమన్వయంతో పని చేసి దేశంలోని వివిధ పార్టీల మద్దతు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. అమరావతి అంశంపై కూటమి ఎంపీలు చూపిన కృషి వల్లే ఈ విజయము సాధ్యమైందన్నారు.రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ఈ బిల్లుకు విస్తృత మద్దతు లభించడం సంతోషకరమని, ముందుకు కూడా ఇదే ఐక్యత కొనసాగాలని లోకేష్ ఆకాంక్షించారు.
