Breaking News

‘మావిగన్’ వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం

అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు రాజధాని లేకుండా చేశారని ఆరోపించిన సీఎం, ఇప్పుడు ‘మావిగన్’ అంటూ వింత ప్రతిపాదనలు తీసుకురావడం ఆశ్చర్యకరమన్నారు. అమరావతి పట్ల జగన్‌కు ఉన్న వ్యతిరేకతకు ఇదే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.అమరావతి పేరు పలకడానికే జగన్ ఇష్టపడరని, అందుకే కొత్త పేర్లతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. రాజధాని అంశంపై జగన్ వైఖరి భవిష్యత్తులోనూ మారదని చంద్రబాబు స్పష్టం చేశారు.

అమరావతి బిల్లుపై జనసేన శ్రేణులకు పిలుపు.. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేయండి: నాదెండ్ల మనోహర్

ప్రేమ వివాహం కారణంగా కూతురిని హత్య చేసిన తండ్రి.. ఆత్మహత్యగా నాటకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *