అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై రాజీ ఉండదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో సమగ్ర శిక్ష అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులకు క్లిక్కర్ విధానాన్ని అమలు చేయాలని, లీప్ యాప్ వినియోగంపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాలని అధికారులను సూచించారు. విద్యా వ్యవస్థలో సాంకేతికత వినియోగాన్ని పెంచడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ప్రాజెక్టుపై కూడా సమీక్ష నిర్వహించిన మంత్రి, భవన తుది నమూనాను ఆమోదించినట్లు వెల్లడించారు. విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

