న్యూఢిల్లీ, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంట్లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును కలిశారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం సహకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్లో మద్దతు లభించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.


