Breaking News

కేంద్ర మంత్రిని కలిసిన లోకేష్.. అమరావతి బిల్లుకు కృతజ్ఞతలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంట్‌లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును కలిశారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం సహకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు లభించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

గోదావరి కాలుష్యంపై పరిశ్రమలకు మంత్రి దుర్గేష్ హెచ్చరిక

ఏపీలో మినీ ఎన్నికల హీట్.. క్యాడర్‌కు సిద్ధంగా ఉండాలని మూడు పార్టీల పిలుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *