పల్నాడు, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో కన్న తండ్రే కూతురిని హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మాచర్లలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.యాదవబజార్కు చెందిన యువతి చౌడేశ్వరి, తనకు ఇష్టమైన యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లిని అంగీకరించని తండ్రి చంద్రశ్రీను, కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.మొదట ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులకు తెలిపినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో గొంతునులిపి హత్య చేసిన తర్వాత ఉరివేసినట్లు తేలింది. దీంతో కేసు మలుపు తిరిగింది.సాంకేతిక ఆధారాలతో నిజాన్ని బయటపెట్టిన పోలీసులు చంద్రశ్రీనును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వివాహాన్ని అంగీకరించలేక కూతురినే బలి తీసుకున్న తండ్రి చర్యపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
