హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది హేట్ స్పీచ్ బిల్లు కాదని, “ఫ్రీ స్పీచ్ను అణిచివేసే బిల్లు” అని వ్యాఖ్యానించారు.ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ హక్కులను హరించడానికే ఈ బిల్లును తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.ఈ హక్కులను కాపాడాల్సిన బాధ్యత యువ న్యాయవాదులపై ఉందని హరీష్ రావు పిలుపునిచ్చారు.
