Breaking News

స్వచ్ఛాంధ్రలో భాగంగా పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమం

ఎ.కొండూరు, ఏప్రిల్‌ 2 (నేటి తెలుగు పత్రిక): స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఎ.కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో సేకరించిన వ్యర్థాలను స్వచ్ఛ రథానికి అందజేశారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.జె.ఎం.డి. ప్రసాదరావు, డిప్యూటీ ఎంపీడీవో ఎం. సందర్ లాల్ పాల్గొని మాట్లాడుతూ. వారానికి ఒకసారి స్వచ్ఛ రథం పాఠశాలకు వస్తుందని, దాని అవసరాన్ని గుర్తించి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారుఅలాగే కార్యక్రమానికి హాజరైన ఎంఈఓ–2 ఈఎల్‌సీ కేశవరావు విద్యార్థులకు తడి చెత్త, పొడి చెత్త, హానికారక చెత్తలను వేర్వేరు రంగుల డబ్బాలలో ఎలా వేరు చేయాలో వివరించారు. అనంతరం పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

గోదావరి కాలుష్యంపై పరిశ్రమలకు మంత్రి దుర్గేష్ హెచ్చరిక

ఏపీలో మినీ ఎన్నికల హీట్.. క్యాడర్‌కు సిద్ధంగా ఉండాలని మూడు పార్టీల పిలుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *