Breaking News

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

మే 12, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో వెకేషన్ బెంచ్‌ను ఆయన ఆశ్రయించినట్లు సమాచారం. ఈ పిటిషన్‌పై ఈ నెల 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది.ఇటీవల నమోదైన ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పందిస్తూ, ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.ప్రస్తుతం కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుండగా, హైకోర్టు విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మియాపూర్‌లో విషాదం.. ఒంటరితనంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

వరంగల్‌లో చైన్ స్నాచర్ల హల్‌చల్.. ఒకే రోజు మూడు ఘటనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *