మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్ఘనిస్థాన్తో జూన్ 6 నుంచి 20 వరకు జరిగే వన్డే, టెస్టు సిరీస్ల కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. వన్డే జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఎంపిక కాగా, టెస్టు జట్టుకూ ఆయనే నాయకత్వం వహించనున్నారు.
వన్డే జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, హర్ప్రీత్ బ్రార్, హర్ష్ దూబే.
టెస్టు జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సుతార్, హర్ప్రీత్ బ్రార్, ధ్రువ్ జురెల్, హర్ష్ దూబే.
ఈ సిరీస్ ద్వారా యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు సెలెక్టర్లు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
