Breaking News

30 trains running through Khammam have been cancelled

ఖమ్మం మీదుగా నడిచే 30 రైళ్లు రద్దు

|| 30 trains running through Khammam have been cancelled || – ప్రయాణికులకు రైల్వే అధికారులు సూచనలు

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేట – విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్ పనుల కారణంగా ఖమ్మం మీదుగా నడిచే విజయవాడ, వరంగల్ మార్గంలోని పలు రైళ్లను ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు రద్దు చేశారు.

రద్దయిన రైళ్లు – దారి మళ్లించిన సర్వీసులు

  • ఖమ్మం మీదుగా నడిచే 107 రైళ్లలో 30 రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
  • భద్రాచలం – విజయవాడ, డోర్నకల్ – విజయవాడ ప్యాసింజర్ రైళ్లు
  • గోల్కొండ ఎక్స్‌ప్రెస్, శాతవాహన ఎక్స్‌ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్
  • పలు రైళ్లను దారి మళ్లించగా, కొన్ని రైళ్లను నిర్దిష్ట తేదీల్లో నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ప్రయాణికులకు సూచనలు

ఈ నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఖమ్మం మీదుగా ప్రయాణించే వారు రిజర్వేషన్ చేసుకునే ముందు రైల్వే అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత స్టేషన్లలో సమాచారం తెలుసుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

ఈ మార్పులు 10 రోజుల పాటు కొనసాగనున్న కారణంగా ప్రయాణికులు ముందస్తుగా తమ ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *