విజయవాడ. ఫిబ్రవరి 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ భవానిపురం స్వాతి థియే టర్ రోడ్డులోని లలితనగర్ లో ఆదివారం, నగరంలో చైతన్య ఆర్తో, పెయిన్ క్లినిక్ ప్రారంభం అయ్యింది.ఈ సందర్భంగా క్లినిక్ నిర్వాహకులు ఎంఎస్ (ఆర్తో), ఎఫ్ ఐ ఏ ఎస్ (ఆర్ట్రో స్కోపి) వైద్య నిపు ణులు డాక్టర్ సాయిచైత న్య గోపవరపు మాట్లాడు తూ విజయవాడనగరంలో గుర్తింపు పొందిన హాస్పిట ల్స్ నుండి విచ్చేసిన ప్రము ఖ వైద్య నిపుణులు పలు వురు క్లీనిక్ ని ప్రారంభించ డం జరిగిందన్నారు. ఆధు నిక పరికరాలతో వైద్య సేవ లు అందిస్తూ వైద్యం నిమి త్తం క్లినిక్ కి వచ్చే ప్రతి ఒక్కరూ తిరిగి ఆనందం పొందే విధంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. మా హాస్పిటల్ నందు అన్ని రకాల ఆర్థోపెటిక్, నొప్పి తగ్గించే వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయ న్నారు. తన భార్య డాక్టర్ అన్విత తో కలిసి చైతన్య ఆర్తో, పెయిన్ క్లినిక్ ను నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. స్కానింగ్, ఎక్సరే, రక్త పరీక్ష సేవలతో పాటు సర్జరీలు, నొప్పిని తగ్గించే మందులు అందు బాటులో ఉంటాయన్నారు. నగర ప్రజలంతా చైతన్య ఆర్తో, పెయిన్ క్లినిక్ యొక్క వైద్య సేవలను వినియోగిం చుకోవాలని విజ్ఞప్తి చేశారు.


