నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం భూముల ధరలను సవరించడానికి అధ్యయనం ప్రారంభించింది. భూముల విలువ పెరిగితే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ కూడా పెరుగుతాయి.అదే సమయంలో, రాష్ట్రంలో కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ భవనాల్లో భూముల రిజిస్ట్రేషన్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, వృద్ధులు, వికలాంగులు, గర్భిణులకు ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయి.

