Breaking News

మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించండి.

మిగిలిన స్థానాలలో లౌకిక, ప్రజాతంత్ర శక్తులను గెలిపించండి.

మతోన్మాద బిజెపిని ఓడించండి: సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి.

అరటి సాగులో ఆధునిక సాంకేతికతపై అవగాహన

సూర్యాపేట నేటి తెలుగు పత్రిక: మున్సిపల్ ఎన్నికల్లో నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గo సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలో కలిపి 11 వార్డులలో పోటీ చేస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తే ప్రజా సమస్యలపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై గళం విప్పుతారని అన్నారు. అవినీతి రహిత పాలన కమ్యూనిస్టులకే సాధ్యమన్నారు. అవకాశవాదులను, అవినీతిపరులను ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. సిపిఎం పోటీ చేయని స్థానాలలో వామపక్ష అభ్యర్థులకు మద్దతిస్తున్నామన్నారు. మిగిలిన స్థానాలలో లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను గెలిపించాలన్నారు. ఈ ఎన్నికల్లో మతోన్మాద ఫాసిస్టు విధానాలు అనుసరిస్తున్న బిజెపిని ఓడించాలన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కోలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు.

ప్లాస్టిక్ రహిత ఆహారాలతో కాన్సర్ నియంత్రణ సాధ్యం: డాక్టర్ సుకన్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *