కోదాడ ,ఫిబ్రవరి 5. (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, మునగాల మండల పరిధిలోని నరసింహపురం గ్రామంలో ఎన్నో ఏళ్లుగా అపరిశుకృతంగా ఉన్న విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు ఇటీవల గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. సంబంధిత డి ఈ హుజూర్నగర్. వారి దృష్టికి తీసుకువెళ్లగా. వెంటనే స్పందించిన సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు నేడు గ్రామానికి అవసరమైన. విద్యుత్ స్తంభాలను. అలాగే జనవాసాల మధ్యలో ఉన్న సింగల్ ఫేస్ ట్రాన్స్ఫారం లను. మరియు. గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు నూతన కరెంటు వైర్లను. ఏర్పాటు చేయడం. ఇంకా తదితర విద్యుత్ సమస్యలను గ్రామ సర్పంచి పర్యవేక్షణలో దగ్గరుండి. పర్యవేక్షించడమైనది. ఈ సందర్భంగా సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు సహకరించిన సంబంధిత విద్యుత్ అధికారులకు సర్పంచ్ సత్యనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలా గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను ఇలాగే. సంబంధిత ప్రతి అధికారులు స్పందించి. చిత్తశుద్ధితో గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు కృషిచేసి. స్థానిక సర్పంచులకు. సహకరించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు వీరబోయిన నరేష్. గ్రామపంచాయతీ సిబ్బంది. . విద్యుత్తు అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


