Breaking News

ప్రకృతి వ్యవసాయం పై విద్యార్థులకు అవగాహన

నడిగూడెం,ఫిబ్రవరి 5(నేటి తెలుగు పత్రిక): మండల పరిధిలోని తెల్లబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ సంస్థ వ్యవస్థాపకులు కిసాన్ సేవా రత్న డాక్టర్ మొలుగూరి గోపయ్య మాట్లాడుతూ మనతో పాటు మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. గత 60 ఏళ్లుగా చేస్తున్న రసాయన వ్యవసాయం తో భూసారం దెబ్బతిన్నదన్నారు. నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యం, పంట ఆరోగ్యమే మన ఆరోగ్యమన్నారు. సహజ సిద్ద పద్ధతులతో భూసారం పెంచడం, చీడ పీడల నివారణపై ఎలాంటి పెట్టు బడులు లేకుండా పలు పద్ధతులను విద్యార్థులకు వివరించారు. విద్యార్థి దశ నుండే ప్రకృతి వ్యవసాయం పై అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు సామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఉమా మహేశ్వరరావు, వెంకటరమణ, సైదులు, యాదగిరి, శ్రీహరి, సీతారామయ్య, శ్రీనివాసరావు, రఫీక్ అహ్మద్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *