Breaking News

భారతీయ జనతా పార్టీ నాయకులను గెలిపించాలి

  • బిజెపి మాజీ మండల అధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్.

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 07 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో మున్సిపాలిటీ 9వ వార్డు రాజమణి గారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారంలో పాల్గొన్న బిజెపి మాజీ మండల అధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్, దొంతు భరత్, డౌట్ పోచయ్య, సీస వెంకటేశు, యాటపెంటయ్య, లక్ష్మీనారాయణ, శత్రు నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్లెం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ యాదగిరిగుట్ట ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాస్వామ్యం అనేది రాజ్యాంగం రాసిన ప్రకారము ఓటు హక్కు వినియోగించుకుని మనకు నచ్చిన వ్యక్తిని గెలిపించవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది కానీ ఇక్కడ మున్సిపాలిటీలో కూని చేస్తూ డబ్బులకు ప్రలోభాలు పెడుతూ అవినీతికి మూల స్తంభాలుగా నిలిచిన టిఆర్ఎస్ కాంగ్రెస్ను బొంద పెట్టి భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదించి నీతి నిజాయితీ ధర్మం గురించి న్యాయం గురించి పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను గెలిపించాలని కోరుకుంటున్నాం అని అన్నారు.

పాషా బాయ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

పెన్షనర్ల హక్కులకై పోరాటo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *