మంత్రి నారా లోకేష్ సేవాస్పూర్తితో
మసీదు నిర్మాణం కోసం 60,000/- వేల రూపాయలు అందించిన మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్.
మంగళగిరి ఫిబ్రవరి 09 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంత్రి నారా లోకేష్ సేవాస్ఫూర్తితో మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలోని రైలుపేట ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మక్కా మసీదుకు మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ రూ.60,000 విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని మసీదు కమిటీ పెద్దలకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజల సహకారంతోనే మసీదు నిర్మాణం సాధ్యమవుతోందని తెలిపారు. మక్కా మసీదు ముస్లిం సోదరుల చిరకాల ఆత్మీయ కోరికగా పేర్కొన్న ఆయన, ఈ మసీదు పూర్తయితే అది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. గ్రామస్థుల నుంచి వస్తున్న సహకారం ప్రశంసనీయమని, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రార్థనలకు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తామని తెలిపారు.అనంతరం మక్కా మసీదు కమిటీ సభ్యులు, మత పెద్దలతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మాదల రమేష్ బాబు,అన్నే చంద్రశేఖర్,జవ్వాది ఆంజనేయులు, యం డి కరిముల్లా, మొద్దుకూరి రమేష్, షేక్ జాన్ సైదా, షేక్ మస్తాన్, షేక్ బాజీ, ఖాదర్, పెద్ద బాజీ, చాని, జాలాది సందీప్, శంషు, బషీర్ , మరియు మక్కా మసీదు కమిటీ సభ్యులు, మత పెద్దలు పాల్గొన్నారు.
