యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 10 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ భ్రమరాంబ,గొల్ల కేతమ్మ, సమేత మల్లికార్జున స్వామి ని దర్శించుకుని స్వామి అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడo జరిగింది. ఈ సందర్భంగా ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించిన తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా కో ఆర్డినేటర్ దేవరుప్పల ఐలయ్య, దత్తాయపల్లి సర్పంచ్ జేరిపోతుల కరుణాకర్,ఉప సర్పంచ్,జిట కిషన్ యాదవ్,మండల కాంగ్రెస్ నాయకులు,గుంటి మల్లేశ్ యాదవ్,గొప్ప కొండల్ రెడ్డి తదితరులు ఉన్నారు.
